రాహుల్ నాయకత్వం దేశానికి అవసరం : తులసిరెడ్డి
ABN , First Publish Date - 2021-06-20T04:54:48+05:30 IST
దేశంలో రాహుల్గాంధీ నాయకత్వం అవసరమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ తులసిరెడ్డి అన్నారు.
కడప (కలెక్టరేట్), జూన్ 19 : దేశంలో రాహుల్గాంధీ నాయకత్వం అవసరమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ తులసిరెడ్డి అన్నారు. శనివారం రాహుల్గాంధీ పుట్టినరోజు సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఎన్ఎ్సయుఐ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు అలాగే మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్యామలాదేవి ఆధ్వర్యంలో విశ్వేశ్వరయ్య కూడలిలో చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరగగా ఎన్ ఎస్యూఐ జాతీయ కార్యదర్శి అలేఖ్య, రాష్ట్ర అధ్యక్షుడు నాగ మధుయాదవ్లు హాజరుకాగా కాంగ్రెస్ నేతలు ధ్రుకుమార్రెడ్డి, లక్ష్మయ్య, పుల్లయ్య, తిరుమలేశు, అలీఖాన్, మధు రెడ్డి, లావణ్య, వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.
పీసీసీ మైనార్టీ ఉపాధ్యక్షుడిగా మహమ్మద్ అలీఖాన్
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షుడిగా నగరానికి చెందిన అడ్వకేటు పఠాన్ మహమ్మధ్ అలీఖాన్ను నియమిస్తూ పీసీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ తులసిరెడ్డి శనివారం డీసీసీ కార్యాలయంలో నియామకపత్రాన్ని అందజేశారు.