జర్నలిస్ట్ అంకబాబు రిమాండ్‌ను తిరస్కరించిన హైకోర్టు

ABN , First Publish Date - 2022-09-23T23:57:05+05:30 IST

సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు రిమాండ్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఏడేళ్లలోపు శిక్ష పడే సెక్షన్లు కావడంతో కోర్టు ఈ రిమాండ్‌ని తిరస్కరించింది.

జర్నలిస్ట్ అంకబాబు రిమాండ్‌ను తిరస్కరించిన హైకోర్టు

గుంటూరు: సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు(Ankababu) రిమాండ్‌ను హైకోర్టు(HIcourt) తిరస్కరించింది. ఏడేళ్లలోపు శిక్ష పడే సెక్షన్లు కావడంతో కోర్టు ఈ రిమాండ్‌ని తిరస్కరించింది.41 ఏ కింద అంకబాబుకి నోటీస్ ఎందుకు ఇవ్వలేదని సీఐడీ(CID)ని జడ్జి ప్రశ్నించారు. 41 ఏ నోటీసు ఇవ్వబోతే  తీసుకోలేదని సీఐడీ అధికారులు తెలిపారు. తనకు సీఐడీ అధికారులు ఎలాంటి నోటిస్ ఇవ్వలేదని అంకబాబు చెప్పారు. అంకబాబుపై గతంలో 20 కేసులు ఉన్నాయని సీఐడీ తెలిపింది. కేసుల ప్రాథమిక వివరాలు సమర్పించాలని న్యాయమూర్తి చెప్పారు. సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇవ్వాలని సీఐడీకి కోర్టు ఆదేశించింది. నోటీసులు ఇస్తే అరెస్ట్ చేసే అవకాశం ఉండదని హైకోర్టు స్పష్టం చేసింది. 

Updated Date - 2022-09-23T23:57:05+05:30 IST