ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులొచ్చాయి
ABN , First Publish Date - 2022-07-01T05:04:38+05:30 IST
రా ష్ట్రంలో వైసీపీ పాలన ఎలా ఉందో ఆ పార్టీ ఎమ్మెల్యేలే చెబుతు న్నారని అద్దంకి ఎమ్మె ల్యే గొట్టిపాటి రవికు మార్ అన్నారు.
ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్
ఒంగోలు (కార్పొరే షన్), జూన్ 30: రా ష్ట్రంలో వైసీపీ పాలన ఎలా ఉందో ఆ పార్టీ ఎమ్మెల్యేలే చెబుతు న్నారని అద్దంకి ఎమ్మె ల్యే గొట్టిపాటి రవికు మార్ అన్నారు. అద్దంకి బంగ్లా రోడ్డులోని వ్యా పారి కొత్తమాసు హను మంతరావు దంపతులపై దుండగులు దాడిచేయగా, ఒంగోలు కిమ్స్లో చికిత్సపొందుతున్నారు. గురువారం బాధితులను గొట్టిపాటి పరామర్శిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పనితీరు పై ప్రజలు వ్యతిరేకత చూపుతున్నారన్నారు. ప్రభుత్వంపై ప్రజలు తిరగబ డే రోజులు వచ్చాయని చెప్పారు. వైసీపీ పాలన, పాలకుల పనితీరుపై టీడీపీ గతంలోనే చెప్పిందన్నారు. ఈరోజు ఆ పార్టీ ఎమ్మెల్యేలు గడప గ డపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలు నిలదీస్తుంటే తమ పార్టీ పనితీరు ఏ విధంగా ఉందో వారికే అర్ధం అవుతుందన్నారు. అదే విషయా న్ని కొందరు ఎమ్మెల్యేలు బహిరంగంగానే గళం విపుతున్నారన్నారు. రాష్ట్రం లో ఎక్కడ ప్రజలకు సంబంధించిన పనులు జగరడం లేదని పేర్కొన్నారు. నాలుగైదు రూపాయలు డబ్బులు వేయడం తప్ప ఎక్కడా కనీసం గుంటలు కూడా పూడ్చని పరిస్థితి ప్రస్తుతం ఉందన్నారు. జిల్లాలో ఇటీవల దుండ గుల దాడులు తీవ్రమయ్యాయన్నారు. చీమకుర్తి, టంగుటూరు, ఇపుడు అద్దంకిలో జరగడం చూస్తుంటే పోలీసులు పెట్రోలింగ్ పెంచాల్సిన అవస రం ఎంతైనా ఉందన్నారు. ముఖ్య కూడళ్ళలో సీసీ కెమెరాలు ఏర్పాటు చే యాలని కోరారు. దొంగతనాలు, దాడుల నియంత్రణకు పోలీసు యంత్రాం గం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. బాధితులైన కొత్తమాసు హనుమంతరావు దంపతులను పరామర్శించి, వైద్యులతో మాట్లాడి మెరుగైన సేవలు అందించాలని రవికుమార్ కోరారు.