పొద్దున్నే రైతుకు కనిపించిందో షాకింగ్ సీన్.. పొలంలో కనిపించిన బైక్.. ఏంటా అని వెళ్లి చూస్తే ఓ వివాహితతోపాటు..

ABN , First Publish Date - 2021-09-16T16:20:29+05:30 IST

ఎప్పటిలాగానే రోజు ఉదయాన్నే పొలానికి వెళ్లిన రైతుకు అక్కడ ఓ బైక్ కనిపించింది..

పొద్దున్నే రైతుకు కనిపించిందో షాకింగ్ సీన్.. పొలంలో కనిపించిన బైక్.. ఏంటా అని వెళ్లి చూస్తే ఓ వివాహితతోపాటు..

ఎప్పటిలాగానే రోజు ఉదయాన్నే పొలానికి వెళ్లిన రైతుకు అక్కడ ఓ బైక్ కనిపించింది.. అక్కడ బైక్ ఉందేంటి అని అనుమానించిన రైతు ముందుకు వెళ్లి చూడగా అక్కడ ఓ షాకింగ్ సీన్ కనిపించింది.. అక్కడ ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు పడి ఉన్నాయి.. అందులో ఒకరు వివాహిత కాగా.. మరొకరు యువకుడు.. దీంతో ఆ రైతు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. పంజాబ్‌లోని గిద్దర్‌బాహా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 


ఇవి కూడా చదవండి

మహిళా SI కు కూడా తప్పని లైంగిక వేధింపులు.. పోలీస్ స్టేషన్‌లోనే అత్యాచారయత్నం.. భర్తకు చెప్తే.




ఈ ఫొటోలో కనిపిస్తున్న యువకుడికి పెద్ద కథే ఉంది.. స్టూడెంట్ నెంబర్1 సినిమాలో NTR లాగా..


గిద్దర్‌బాహా గ్రామానికి చెందిన సుఖ్‌దేవ్ సింగ్ అనే వ్యక్తి తన పొలంలో పడి ఉన్న ఇద్దరు వ్యక్తులమృతదేహాలను చూసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాఫ్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. అలాగే సంఘటనా స్థలం వద్ద ఉన్న బైక్‌ను, పురుగుల మందుల డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. యువకుడిని ముక్తర్‌కు చెందిన సుఖ్‌ప్రీత్ సింగ్‌గా గుర్తించారు. ఆమెను అదే ప్రాంతానికి చెందిన వివాహితగా గుర్తించారు. ప్రేమ వ్యవహారం కారణంగానే ఇద్దరూ ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.  

Updated Date - 2021-09-16T16:20:29+05:30 IST