రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
ABN , First Publish Date - 2021-11-28T05:10:11+05:30 IST
44వ జా తీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమా దంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు.
భూత్పూర్, నవంబరు 27 : 44వ జా తీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమా దంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నా యి. మండలంలోని అన్నాసాగర్ గ్రామానికి చెందిన బాలస్వామి, అరుణ దంపతులకు భానుప్రకాష్, శ్రీకాంత్ అనే ఇద్దరు కుమా రులు ఉన్నారు. వీరు శనివారం సొంత పను ల నిమిత్తం స్కూటీపై భూత్పూర్కు వస్తుం డగా గద్వాల ప్రాంతానికి చెందిన ఉప్పరి నర్సిములు తన కారులో భూత్పూర్ వైపు వెళ్తూ పోతులమడుగు గ్రామ శివారులో బ్రిడ్జి వద్ద వెనుకాల నుంచి వచ్చిన కారు అదుపు తప్పి స్కూటీని ఢీకొట్టింది. ప్రమాదంలో స్కూటీపై ప్రయాణి స్తున్న శ్రీకాంత్కు తీవ్ర గాయాలు అయ్యాయి, భానుప్రకాష్(23) అక్కడిక క్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతుడి తండ్రి బాలస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భాస్కర్రెడ్డి తెలిపారు.