ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతి టీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు
ABN , First Publish Date - 2020-08-07T05:57:12+05:30 IST
సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అకాల మరణం టీఆర్ఎస్ పార్టీకి, తనకి తీరని లోటని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్రెడ్డి
ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్రెడ్డి
కొల్లాపూర్, ఆగస్టు 6 : సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అకాల మరణం టీఆర్ఎస్ పార్టీకి, తనకి తీరని లోటని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్రెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రామలింగారెడ్డి చిత్ర పటానికి పూల మాలలు వేసి ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుగా జీవితం ప్రారంభించి నాలుగు సార్లు దుబ్బాక ఎమ్మెల్యేగా గెలుపొంది నియోజకవర్గ ప్రజలకు అశేష సేవలందించిన రామలింగారెడ్డి మృతి తనకు తీరని లోటు మిగిల్చిందని ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు చంద్రశేఖరాచారి, కోట్ల జితేందర్రాజు, సాయిరాంయాదవ్, మూలే కేశవులు, ప్రదీప్, ఎల్లగౌడ్ తదితరులు పాల్గొన్నారు.