శిలాఫలకం ధ్వంసం దారుణం

ABN , First Publish Date - 2022-07-03T05:26:00+05:30 IST

స్థానిక జిల్లా కేంద్ర ఆసుపత్రి ప్రాంగణంలో శిలా ఫలకం శుక్రవారం ధ్వంసం చేయడంపై టీడీపీ నాయకులు శనివారం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఆర్డీవో హెచ్‌వీ జయరాంకు ఫిర్యాదు చేశారు. ఈ తరహా చర్యలు వైసీపీ ప్రభుత్వ పాల నలో అధికమయ్యాయని, ఇది హేయమైన చర్య అని టీడీపీ నాయకులు అన్నారు. శిలాఫలకాలు ధ్వంసం చేయడం వైసీపీ నీచ రాజకీయాలకు నిదర్శనమని, విచారణ చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డి మాండ్‌ చేశారు.

శిలాఫలకం ధ్వంసం దారుణం
ఆర్డీవోకు వినతిపత్రం ఇస్తున్న టీడీపీ నాయకులు


 ఆర్డీవోకు టీడీపీ నేతల ఫిర్యాదు
టెక్కలి:
స్థానిక జిల్లా కేంద్ర ఆసుపత్రి ప్రాంగణంలో శిలా ఫలకం శుక్రవారం ధ్వంసం చేయడంపై టీడీపీ నాయకులు శనివారం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఆర్డీవో హెచ్‌వీ జయరాంకు ఫిర్యాదు చేశారు. ఈ తరహా చర్యలు వైసీపీ ప్రభుత్వ పాల నలో అధికమయ్యాయని, ఇది హేయమైన చర్య అని టీడీపీ నాయకులు అన్నారు. శిలాఫలకాలు ధ్వంసం చేయడం వైసీపీ నీచ రాజకీయాలకు నిదర్శనమని, విచారణ చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డి మాండ్‌ చేశారు. ఆర్డీవోకు వినతి పత్రం ఇచ్చిన వారిలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బోయిన గోవిందరాజులు, టెక్కలి, నందిగాం, సంత బొమ్మాళి మండల పార్టీ అధ్యక్షులు బగాది శేషగిరి, పినకాన అజయ్‌కుమార్‌, జీరు భీమారావు, నాయకులు మెండ దాసు నాయుడు, మట్ట పురుషోత్తం, బసవల అప్పల స్వామి, రెయ్యి ప్రీతీష్‌, రాము, లవ, కామేసు, ప్రసాద్‌రెడ్డి  ఉన్నారు.
  

Updated Date - 2022-07-03T05:26:00+05:30 IST