రాజ్యాధికారంతోనే బీసీల అభివృద్ధి
ABN , First Publish Date - 2022-05-16T04:23:49+05:30 IST
రాజ్యాధికారంతోనే బీసీల అభివృద్ధి జరు గుతుందని జన అధికార సమితి మార్గ దర్శకుడు నరహరి అన్నారు. ఆదివారం బీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జన అధికారసమితి అవగాహణ సద స్సులో ఆయనమాట్లాడారు. చట్టసభల్లో బీసీలకు సరైన ప్రాధాన్యత ఇవ్వటం లేదన్నారు.
- జన అధికారి సమితి మార్గదర్శకుడు నరహరి
ఆసిఫాబాద్ రూరల్, మే 15: రాజ్యాధికారంతోనే బీసీల అభివృద్ధి జరు గుతుందని జన అధికార సమితి మార్గ దర్శకుడు నరహరి అన్నారు. ఆదివారం బీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జన అధికారసమితి అవగాహణ సద స్సులో ఆయనమాట్లాడారు. చట్టసభల్లో బీసీలకు సరైన ప్రాధాన్యత ఇవ్వటం లేదన్నారు. జనాభాలో 56శాతం ఉన్న బీసీలకు ఇంతవరకు గుర్తింపు లేద న్నారు. రాష్ట్రంలో ఒక్క బీసీ మహిళ ఎమ్మెల్యే లేదన్నారు. బీసీలు సంఘటితమై పోరాటం చేయాల్సిన అవసరం ఉంద న్నారు. సమావేశంలో బీసీసంక్షేమసంఘం జిల్లా అధ్యక్షుడు రూష్నర్, ఏఐటీయూసీ కేంద్రకార్యదర్శి ఉపేందర్, బీసీ సంఘం అధ్యక్షుడు మారుతీ, బీసీ ఐక్య సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు కేసరి అంజనేయులు గౌడ్ పాల్గొన్నారు.