యువకుడి అదృశ్యం

ABN , First Publish Date - 2021-02-28T05:04:19+05:30 IST

యువకుడి అదృశ్యం

యువకుడి అదృశ్యం

మొయినాబాద్‌ రూరల్‌: ఓ యువకుడు అదృశ్యమైన ఘటన మండల పరిధిలోని హిమయత్‌నగర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని హిమయత్‌ నగర్‌ గ్రామానికి చెందిన మహ్మద్‌ మహబూబ్‌ కుమారుడు మహ్మద్‌ అల్తాఫ్‌(27) నగరంలో కారు మెకానిక్‌గాపనిచేస్తున్నాడు. ఈనెల 24న రాత్రి 9.30 గంటలకు పాతబస్తిలోని బహదూర్‌ ప్రాంతానికి తన బైక్‌పైవెళ్లాడు. ఇంటికి తిరిగిరాకపోవడంతో తండ్రి మహ్మద్‌ మహబూబ్‌, పెద్ద కుమారుడు అక్బర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-02-28T05:04:19+05:30 IST