సొంతింటి కల నిజం చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-09-24T05:27:36+05:30 IST

విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తూ నిధులు కేటాయిస్తుందని శాప్‌నెట్‌ చైర్మన్‌, వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు.

సొంతింటి కల నిజం చేసుకోవాలి
జగనన్న కాలనీలలో ఇళ్ళ నిర్మాణం చేపట్టని లబ్ధిదారులతో మాట్లాడుతున్న కృష్ణచైతన్య

శాప్‌నెట్‌ చైర్మన్‌ బాచిన కృష్ణచైతన్య

అద్దంకి, సెప్టెంబరు 23: విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం  అధిక  ప్రాధాన్యం ఇస్తూ నిధులు కేటాయిస్తుందని శాప్‌నెట్‌ చైర్మన్‌, వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు. పట్టణంలోని శ్రీప్రకాశం ప్రభుత్వ జూని యర్‌ కళాశాలలో మైనర్‌ మరమ్మతులు, బాలికల టాయిలెట్స్‌ నిర్మాణంకు శుక్ర వారం శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక నగరపంచాయతీ కార్యాలయం లో నాగులపాడు రోడ్డు జగనన్న కాలనీలో ఇళ్ళ నిర్మాణం ప్రారంభించని లబ్ధి దారులతో నిర్వహించిన సమావేశంలో కృష్ణచైతన్య పాల్గొని మాట్లాడారు. ఇళ్ళ స్థలాలు పొందిన లబ్ధిదారులందరూ ఇళ్ళు నిర్మాణం చేసుకొని సొంతింటి కల ని జం చేసుకోవాలన్నారు. సొంతగా ఇళ్ళు నిర్మాణం చేసుకోలేని లబ్ధిదారులకు కాం ట్రాక్టర్ల  ద్వారా  నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో నగరపంచాయతీ చైర్‌పర్సన్‌ ఎస్తేరమ్మ, వైస్‌చైర్మన్‌లు  దేసు పద్మేష్‌, అనంతలక్ష్మి, కమిషనర్‌ రవికుమార్‌, హౌసింగ్‌ ఏఈ కి రణ్‌, కొల్లా భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-24T05:27:36+05:30 IST