తెలంగాణ ఆవిర్భావ కల నెరవేరుతోంది

ABN , First Publish Date - 2021-07-27T04:11:48+05:30 IST

గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధితో తెలంగాణ ఆవిర్భావ కల నెరవేరుతోం దని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

తెలంగాణ ఆవిర్భావ కల నెరవేరుతోంది
చెక్‌డ్యాంలోకి పూలు చల్లుతున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్యే ఆల

- ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

-  గౌరిదేవిపల్లిలో చెక్‌డ్యాం ప్రారంభం 

- ఈత కొట్టిన మంత్రి, ఎమ్మెల్యే

అడ్డాకుల, జూలై 26: గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధితో తెలంగాణ ఆవిర్భావ కల నెరవేరుతోం దని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకుల మండల పరిధిలోని గౌరిదేవిపల్లి దగ్గర రూ.5 కోట్ల తో నిర్మించిన చెక్‌డ్యాంను ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వ ర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జ ల పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గత పాలకు ల నిర్లక్ష్యం కారణంగా కళ్ల ముందు పారుతున్న న దులు, వాగుల నీరంతా  సముద్రం పాలు చేసి రై తులను వలసబాట పట్టించారన్నారు. పాలమూ రు రంగారెడ్డితో జిల్లా సస్యశ్యామలం అవుతుంద న్నారు. ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ దేవరకద్ర ని యోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. అనంతరం అడ్డాకుల, మూసాపేట మండలాల ల బ్ధిదారులకు నూతన రేషన్‌కార్డులు పంపిణీ చేశా రు. అనంతరం మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్యే ఆల చెక్‌డ్యాంలో సరదాగా ఈత కొట్టారు. కార్యక్ర మంలో జడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణసుధాకర్‌రెడ్డి, అడ్డా కుల, మూసాపేట ఎంపీపీలు నాగార్జున్‌రెడ్డి, కళా వతి, జడ్పీటీసీలు రాజశేఖర్‌రెడ్డి, ఇంద్రయ్యసాగర్‌, వైస్‌ ఎంపీపీ రాధిక, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనరసింహా, వనపర్తి జడ్పీ వైస్‌చైర్మన్‌ వామన్‌ గౌడ్‌, తహసీల్దార్‌ కిషన్‌, సింగిల్‌విండో అధ్యక్షుడు జితేందర్‌రెడి,్డ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-27T04:11:48+05:30 IST