ఎనిమిది వార్డులు ఏకగ్రీవం

ABN , First Publish Date - 2021-03-07T04:54:16+05:30 IST

ఎస్‌.వెంకట్రామాపురం, సంచర్ల పంచాయతీల్లో ఎనిమిది వార్డులు ఏకగ్రీవమయ్యాయని ఎంపీడీఓ నూర్జహాన తెలిపారు.

ఎనిమిది వార్డులు ఏకగ్రీవం

పోరుమామిళ్ల, మార్చి 6: ఎస్‌.వెంకట్రామాపురం, సంచర్ల పంచాయతీల్లో ఎనిమిది వార్డులు ఏకగ్రీవమయ్యాయని ఎంపీడీఓ నూర్జహాన తెలిపారు. ఎస్‌.వెంకట్రామాపురంలో ఆరు వార్డులకు గాను ఒక్కొక్కరే నామినేషన వేశారన్నారు. సంచర్ల పంచాయతీలో 3 వార్డులకు నలుగురు నామినేషన్లు వేయగా 7వవార్డుకు పోటీలో ఉన్నారని, మిగిలిన రెండు వార్డులు కూడా ఏకగ్రీవమయ్యాయని తెలిపారు.

సర్పంచు స్థానాలకు ఏడు నామినేషన్లు 

వేంపల్లె, మార్చి 6: టి వెలమవారిపల్లె పంచాయతీ ఎన్నికల్లో సర్పం చు స్థానానికి మొత్తం ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి రోజు మూడు, రెండో రోజు మూడు, చివరి రోజు శనివారం అశ్వని సర్పంచు స్థానానికి నామినేషన్లు వేశారు. వార్డు స్థానాలకు పలువురు నామినేషన్లు వేశారు. ఆదివారం పరిశీలన చేయాల్సి ఉంది.

Updated Date - 2021-03-07T04:54:16+05:30 IST