ఇంట్లో నగ్నంగా తల్లీకూతుళ్ల మృతదేహాలు.. 10 రోజుల తర్వాత కొడుకు రాకతో బయటపడిన దారుణం.. షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే..

ABN , First Publish Date - 2022-09-01T21:29:33+05:30 IST

వివాహేతర సంబంధాలు (Extramarital affairs) లేదా డబ్బుల విషయంలో నేరాలు, ఘోరాలకు పాల్పడడం ఇటీవల సర్వసాధారణమైంది. ఎన్ని కఠిన శిక్షలు అమలు చేస్తున్నా..

ఇంట్లో నగ్నంగా తల్లీకూతుళ్ల మృతదేహాలు.. 10 రోజుల తర్వాత కొడుకు రాకతో బయటపడిన దారుణం.. షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే..

వివాహేతర సంబంధాలు (Extramarital affairs) లేదా డబ్బుల విషయంలో నేరాలు, ఘోరాలకు పాల్పడడం ఇటీవల సర్వసాధారణమైంది. ఎన్ని కఠిన శిక్షలు అమలు చేస్తున్నా.. నేరాలు మాత్రం తగ్గడం లేదు. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో తల్లీకూతుళ్ల మృతదేహాలు (Dead bodies) నగ్నంగా పడి ఉండడం తీవ్ర సంచలనం కలిగించింది. పది రోజుల తర్వాత కొడుకు ఇంటికి రావడంతో దారుణం బయటపడింది. పోలీసుల విచారణలో (Police investigation) అసలు నిజాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే..


ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) వారణాసి పరిధి నారియాకు చెందిన సునీతా పాండే (55) అనే మహిళకు ఇద్దరు కుమారులు, దీపికా పాండే(28) అనే కుమార్తె ఉన్నారు. ఈమె భర్త బాల్ముకుంద్.. రిటైర్డ్ విద్యుత్ శాఖ ఉద్యోగి. రెండేళ్ల క్రితం అనారోగ్య కారణంగా మరణించారు. వీరి పెద్ద కుమారుడు అఖిలేష్.. అలహాబాద్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తుండగా, చిన్న కుమారుడు ఆంజనేయులు చోలాపూర్‌లోని ఓ పౌల్ట్రీ ఫాంహౌస్‌లో పనిచేస్తున్నాడు. ఇదిలావుండగా, జూలై 13న ఆంజనేయులు.. 10 అనంతరం సొంతూరుకి వచ్చాడు. అయితే ఇంట్లోకి వెళ్లి చూడగా.. తల్లీ, చెల్లెలి మృతదేహాలు నగ్నంగా పడి ఉండడం చూసి షాక్ అయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని పరిశీలించారు. దుండగుల కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

road accident: అయ్యో..! సరైన సమయానికి ఆస్పత్రికి తీసుకొచ్చినా దక్కని ఫలితం.. చివరకు అంబులెన్స్ డోర్స్ కారణంగా..


ఇన్నాళ్లూ ఈ కేసు మిస్టరీగా మారింది. అయితే 47రోజుల ఎట్టకేలకు మిస్టరీ వీడింది. భదోహి ప్రాంతానికి చెందిన అమన్, అతుల్ విశ్వకర్మ అనే సోదరులు ఈ హత్యకు పాల్పడినట్లు తేలింది. ఘటన జరిగిన రోజు రాత్రి ఇంటి వెనుక ఉన్న రోడ్డు గుండా లోపలికి ప్రవేశించారు. వెళ్లీ వెళ్లగానే తల్లీకూతుళ్ల తలపై సుత్తి, ఇనుప రాడ్‌తో కొట్టి హత్య చేశారు. తర్వాత మొబైల్‌ ఫోన్లతో సహా నగలు, నగదును ఎత్తుకెళ్లారు. ఈ కేసులో నిందితులిద్దరితో పాటూ వారికి సహకరించిన మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మిస్టరీని ఛేదించిన వారణాసి పోలీసులను ఉత్తరప్రదేశ్ డీజీపీ డీఎస్ చౌహాన్ అభినందించారు.

యువతితో పరిచయం పెంచుకున్న మటన్ వ్యాపారి... ఓ రోజు ఎవరూ లేని సమయంలో ఇంటికి పిలిచి.. కలిసి ఉందామంటూ..



Updated Date - 2022-09-01T21:29:33+05:30 IST