రైతు మహాసభలను విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-06-28T04:49:57+05:30 IST

రైతు మహాసభలను విజయవంతం చేయాలి

రైతు మహాసభలను విజయవంతం చేయాలి


చేవెళ్ల, జూన్‌ 27: రైతు మహాసభలను విజయవంతం చేయాలని రంగారెడ్డి జిల్లా రైతుసంఘం ప్రధాన కార్యదర్శి ఎం.ప్రభులింగం, సీపీఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు రామస్వామి అన్నారు. సోమవారం చేవెళ్ల మండల కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వచ్చే నెల 1, 2, 3వ తేదీల్లో సూర్యపేట జిల్లాలోని హుజూర్‌నగర్‌ పట్టణ కేంద్రంలో తెలంగాణ రైతుసంఘం మహాసభలు జరుగుతాయన్నారు. ఈ మహాసభలకు రైతులు అధిక సంఖ్యలో హాజరుకావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి, నాయకులు అంజయ్య, శివ, పరమయ్య, సుధీర్‌, జంగయ్య, సుధాకర్‌గౌడ్‌, మక్బుల్‌, వినోద్‌ ఉన్నారు. 

Updated Date - 2022-06-28T04:49:57+05:30 IST