అందరి సహకారంతో ఉత్సవాలు విజయవంతం
ABN , First Publish Date - 2022-05-20T05:32:42+05:30 IST
అందరి సహకారంతో మోదకొండమ్మ ఉత్సవాలు విజయవంతమయ్యాయని ఆలయ,ఉత్సవ కమిటీ చైర్పర్సన్, ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు.
ఆలయ కమిటీ చైర్పర్సన్ కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి
పాడేరు, మే 19 (ఆంధ్రజ్యోతి): అందరి సహకారంతో మోదకొండమ్మ ఉత్సవాలు విజయవంతమయ్యాయని ఆలయ,ఉత్సవ కమిటీ చైర్పర్సన్, ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు. తన క్యాంప్ కార్యాలయంలో గురువారం సాయంత్రం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్, ఎస్పీ సతీశ్కుమార్, ఐటీడీఏ పీవో గోపాలక్రిష్ణ, సబ్కలెక్టర్ అభిషేక్, వివిధ శాఖల అధికారులు, పోలీసులు, ప్రజాప్రతినిధులు, మీడియా, అందరి సహకారంతో ఉత్సవాలు జయపద్రమయ్యాయన్నారు. అందరికీ ధన్యవాదాలు తెలిపారు. రెండేళ్లుగా ఉత్సవాలకు జరగకపోవడంతో ఈ ఏడాది అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారికి దర్శించుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ టి.నరసింగరావు, ఆలయ/ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి కొట్టగుళ్లి సింహాచలంనాయుడు, ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షుడు బలరామ్మజ్జి, సభ్యులు వెంకటరత్నం, నానీపాత్రులు, గబ్బాడ సింహాచలం పాల్గొన్నారు.