అత్యాచారం నిందితుడిని శిక్షించాలని ఐద్వా ఆందోళన

ABN , First Publish Date - 2022-01-23T05:20:36+05:30 IST

నక్కపల్లి మండలం రాజయ్యపేటలో 11 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ ఐద్వా ఆధ్వర్యంలో శనివారం జీవీఎంసీ 79వ వార్డు పరిధి దేశపాత్రునిపాలెంలో ఆందోళన చేపట్టారు.

అత్యాచారం నిందితుడిని శిక్షించాలని ఐద్వా ఆందోళన
దేశపాత్రునిపాలెంలో ఆందోళన చేస్తున్న ఐద్వా కార్యకర్తలు

పరవాడ, జనవరి 22: నక్కపల్లి మండలం రాజయ్యపేటలో 11 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ ఐద్వా ఆధ్వర్యంలో శనివారం జీవీఎంసీ 79వ వార్డు పరిధి దేశపాత్రునిపాలెంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఐద్వా మండల కార్యదర్శి పి.మాణిక్యం మాట్లాడుతూ నిందితుడికి ప్రభుత్వం తక్షణమే ఉరిశిక్ష వేసేలా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. మహిళల భద్రతకు ప్రత్యేక చట్టాలను తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా ప్రతినిధులు కె.శారద, కె.రాణి, వేణు, ఎం.జ్యోతి, ఎం.భవాని, పి.అనూష తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-23T05:20:36+05:30 IST