తుది విడత చందనం అరగదీత ప్రారంభం

ABN , First Publish Date - 2022-07-07T06:19:06+05:30 IST

వరాహలక్ష్మీనృసింహస్వామికి పైపూతగా సమర్పించేందుకు నాల్లో విడత చందన సమర్పణకు చందనం అరగదీత బుధవారం ప్రారంభించారు. ఆషాడమాస శుక్లపక్ష పౌర్ణమి ఈనెల 13న మూడుమణుగుల(125కిలోల) చందనాన్ని స్వామికి సమర్పించనున్నారు.

తుది విడత చందనం అరగదీత ప్రారంభం
చందనం అరగదీస్తున్న ఉద్యోగి

సింహాచలం, జూలై 6: వరాహలక్ష్మీనృసింహస్వామికి పైపూతగా సమర్పించేందుకు నాల్లో విడత చందన సమర్పణకు  చందనం అరగదీత బుధవారం ప్రారంభించారు. ఆషాడమాస శుక్లపక్ష పౌర్ణమి ఈనెల 13న  మూడుమణుగుల(125కిలోల) చందనాన్ని స్వామికి సమర్పించనున్నారు. ఇందులో భాగంగా బుధవారం  మంచి గంధపు చెక్కను అంతరాలయంలో స్వావి చెంతనుంచి ప్రత్యేక పూజలు చేశారు.  నాల్గో తరగతి సిబ్బంది సంప్రదాయ దుస్తులతో, నోటికి గుడ్డలు కట్టుకుని ప్రత్యేక శిలలపై చందనం అరగదీశారు. తొలిరోజున 29.8 కిలోల శ్రీచందనపు ముద్దను సిద్ధం చేయగా, దానిని దేవాలయ స్థానాచార్యులు రాజగోపాల్‌, ఏఈఓ ఆనందకుమార్‌ సమక్షంలో తూనికవేసి పద్మనిధి (బాంఢాగారం)లో భద్రపరచారు.

Updated Date - 2022-07-07T06:19:06+05:30 IST