అగ్నిపథ్‌ రద్దు చేయాలి : కాంగ్రెస్‌

ABN , First Publish Date - 2022-06-28T07:01:31+05:30 IST

బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్ని పథ్‌ పథకాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర మైనార్టీ విభాగం అధ్యక్షు డు దాదాగాంధీ డిమాండ్‌ చేశారు.

అగ్నిపథ్‌ రద్దు చేయాలి : కాంగ్రెస్‌
అనంతపురంలో మాట్లాడుతున్న దాదాగాంధీ

అనంతపురం న్యూటౌన, జూన 27 : బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్ని పథ్‌ పథకాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర మైనార్టీ విభాగం అధ్యక్షు డు దాదాగాంధీ డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక అంబేద్కర్‌ విగ్రహం వద్ద శాంతియుత సత్యాగ్రహం దీక్ష చేపట్టారు. ఆయన మాట్లాడుతూ..  భారత సైన్యాన్ని అవమాన పరిచేలా అగ్నిపథ్‌ పథకం ఉందని, దాన్ని వెంటనే రద్దు చేయకపోతే దశల వారీగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేట్‌ వ్యక్తులకు అప్పగించడం సరికాదన్నారు.  రిజరేషన్లను రద్దు చేసేలా కేంద్ర నిర్ణయాలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బండ్లపల్లి ప్రతాప్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి శివశంకర్‌ యాదవ్‌, జిల్లా ఉపాధ్యక్షుడు వాసు, ప్రధాన కార్యదర్శి ఫకృద్ధీన పాల్గొన్నారు.  


Updated Date - 2022-06-28T07:01:31+05:30 IST