తెలంగాణకు ఏపీ ఉద్యోగుల తొలి బ్యాచ్
ABN , First Publish Date - 2021-04-23T09:41:57+05:30 IST
తెలంగాణ స్థానికత కలిగి వివిధ శాఖల్లో పని చేస్తున్న 64 మంది ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేసింది.
వివిధ శాఖల్లో పనిచేస్తున్న 64 మంది రిలీవ్
హైదరాబాద్, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ స్థానికత కలిగి వివిధ శాఖల్లో పని చేస్తున్న 64 మంది ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేసింది. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన మూడు, నాలుగో తరగతి ఉద్యోగులను తెలంగాణకు తీసుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించడం.. అదే రోజు తెలంగాణలో ఏ ప్రాంతంలోనైనా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నవారి నుంచి అంగీకారం తీసుకొని రిలీవ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఏపీకి లేఖ కూ డా రాసిన విషయం విదితమే. ఉద్యోగులను రిలీవ్ చేసేందుకు మూడు వా రాల కిందటే సుముఖత తెలిపిన ఏపీ ప్రభుత్వం తాజాగా 64 మందిని రిలీవ్ చేసింది. దీంతో వీరంతా శుక్రవారం తెలంగాణలో రిపోర్ట్ చేయనున్నారు.