తొలి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ ఏసీ బస్సు!
ABN , First Publish Date - 2022-08-19T06:23:10+05:30 IST
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ అశోక్ లేల్యాండ్ అనుబంధ కంపెనీ స్విచ్ మొబిలిటీ దేశంలో తొలి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ ఏసీ బస్సును అందుబాటులోకి..
ఒక్కసారి చార్జింగ్ చేస్తే 250 కి.మీ. ప్రయాణం
ముంబై, ఆగస్టు 18: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ అశోక్ లేల్యాండ్ అనుబంధ కంపెనీ స్విచ్ మొబిలిటీ దేశంలో తొలి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ ఏసీ బస్సును అందుబాటులోకి తెచ్చింది. గురువారం ముంబైలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ బస్సును ప్రారంభించారు. డబుల్ డెక్కర్ ఏసీ బస్సుతో పాటు మరో ఎలక్ట్రిక్ బస్సును కూడా మంత్రి ప్రారంభించారు. ఈ బస్సులను ‘బృహన్ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్)’ సంస్థ కొనుగోలు చేసింది. ఈ బస్సు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని స్విచ్ మొబిలిటీ ఇండియా సీఈవో మహేశ్ బాబు చెప్పారు.