కామారెడ్డి జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు
ABN , First Publish Date - 2022-01-05T01:33:32+05:30 IST
జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు
కామారెడ్డి: జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదయింది. ఎల్లారెడ్డికి చెందిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్ నిర్దారణ అయింది. ఇటీవలే అమెరికా నుంచి వచ్చిన వ్యక్తి నుంచి మూడు రోజుల క్రితం శాంపిల్స్ ను అధికారులు సేకరించారు. చికిత్స కోసం బాధితున్ని హైద్రాబాద్కు తరలించారు. ముందు జాగ్రత్ర చర్యగా గ్రామంలో శానిటైజేషన్ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.