నీళ్లు కావాలని యువతిని అడిగిన ఫుడ్ డెలివరీ బాయ్.. ఆమె వెనుకే లోపలికి వెళ్లి.. ముద్దులు పెట్టి మరీ...

ABN , First Publish Date - 2022-09-22T02:27:11+05:30 IST

కామాంధులు రెచ్చిపోతున్నారు. తమ మాట వినని మహిళలపై అత్యాచారాలు, హత్యలకు తెగబడుతున్నారు. బయటికి వెళ్లిన మహిళలు.. ఇంటికి క్షేమంగా చేరుకుంటారన్న నమ్మకం..

నీళ్లు కావాలని యువతిని అడిగిన ఫుడ్ డెలివరీ బాయ్.. ఆమె వెనుకే లోపలికి వెళ్లి.. ముద్దులు పెట్టి మరీ...
ప్రతీకాత్మక చిత్రం

కామాంధులు రెచ్చిపోతున్నారు. తమ మాట వినని మహిళలపై అత్యాచారాలు, హత్యలకు తెగబడుతున్నారు. బయటికి వెళ్లిన మహిళలు.. ఇంటికి క్షేమంగా చేరుకుంటారన్న నమ్మకం లేకుండా పోయింది. కొన్నిసార్లు ఇళ్లలో ఉన్నా కూడా భద్రత లేని పరిస్థితి నెలకొంది. మహారాష్ట్రలో ఇలాగే జరిగింది. పార్సిల్ తీసుకొచ్చిన ఫుడ్ డెలివరీ బాయ్.. యువతిని నీళ్లు కావాలంటూ అడిగాడు. లోపలికి వెళ్లిన ఆమెను ఫాలో అవుతూ వెళ్లాడు. ఉన్నట్టుండి బలవంతంగా ముద్దులు పెట్టి మరీ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..


మహారాష్ట్ర (Maharashtra) పూణెలో (Pune) ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న ఓ యువతి.. జోమాటో ఫుడ్ యాప్‌లో ఆర్డర్ పెట్టింది. గంటల వ్యవధిలో ఓ యువకుడు ఆర్డర్ తీసుకుని వచ్చాడు. యువతి ఒక్కటే ఇంట్లో ఉందని గ్రహించిన అతడు.. ఆమెపై కన్నేశాడు. నీళ్లు కావాలని అడగడంతో యువతి లోపలికి వెళ్లింది. దీంతో ఆమెను ఫాలో అవుతూ వెనుకే వెళ్లాడు. లోపలికి వెళ్లిన తర్వాత ఒక్కసారిగా ఆమెను పట్టుకుని ముద్దులు పెట్టాడు. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇలా జరగడంతో యువతి షాక్ అయింది.

కాబోయే భార్యను బయటికి తీసుకెళ్లి.. తాకరాని చోట తాకడంతో పాటూ అందుకు ఒప్పుకోవాలంటూ ఒత్తిడి.. అయినా ఆమె వినకపోవడంతో..


తర్వాత యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. జరిగిన ఘటనను తన స్నేహితురాలికి తెలియజేసింది. తర్వాత ఇద్దరూ కలిసి పోలీసులను ఆశ్రయించి, ఫిర్యాదు చేశారు. అయితే విచారణలో పోలీసులకు అసలు నిజం తెలిసింది. ఆ యువకుడు జోమాటో డెలివరీ బాయ్ కాదని, జోమాటో డన్జో అనే యాప్ నుంచి వచ్చాడని తెలిసింది.  రయీస్ షేక్ అనే వ్యక్తి అని తెలుసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అతను నాకంటే చిన్నవాడు.. అలా చేశాడంటే ఎవరూ నమ్మరు.. అంటూ లేఖ రాసిన యువకుడు.. తప్పక ఇలా చేయాల్సి వస్తోందంటూ..



Updated Date - 2022-09-22T02:27:11+05:30 IST