పోలీసుల ఔదార్యం
ABN , First Publish Date - 2022-05-15T04:19:24+05:30 IST
ఆసిఫాబాద్ మండలంలోని ఇప్పల్నవేగాం గ్రామపంచాయతీ కొలాంగొంది పునారవాస కాలనీకి చెందిన ఆత్రం అయ్యు బాయి(26) అనే మహిళ శుక్రవారం రాత్రి పాముకాటుకు గురైంది. శుక్ర వారం రాత్రి బహిర్భుమికి వెళ్లిన ఆమెను పాము కాటువేయడంతో బంధు వులు 108కు ఫోన్ చేశారు. అయితే వారు స్పందించలేదు. వెంటనే ఓ గిరి జనుడు పోలీసులను ఫోన్ ద్వారా సంప్రదించాడు.
- పాముకాటుకు గురైన గిరిజన మహిళ
- తక్షణమే స్పందించి వాహనాన్ని సమకూర్చిన ఎస్సై
ఆసిఫాబాద్రూరల్, మే 14: ఆసిఫాబాద్ మండలంలోని ఇప్పల్నవేగాం గ్రామపంచాయతీ కొలాంగొంది పునారవాస కాలనీకి చెందిన ఆత్రం అయ్యు బాయి(26) అనే మహిళ శుక్రవారం రాత్రి పాముకాటుకు గురైంది. శుక్ర వారం రాత్రి బహిర్భుమికి వెళ్లిన ఆమెను పాము కాటువేయడంతో బంధు వులు 108కు ఫోన్ చేశారు. అయితే వారు స్పందించలేదు. వెంటనే ఓ గిరి జనుడు పోలీసులను ఫోన్ ద్వారా సంప్రదించాడు. ఆ సమయంలో విధులు నిర్వహి స్తున్న ఎస్సై గంగన్న తన పెట్రోలింగ్ వాహనాన్ని సిబ్బందికి ఇచ్చి సంఘటన స్థలానికి వెళ్లి బాధితురాలిని ఆస్పత్రికి తరలించాలని సూచించాడు. వెంటనే పోలీసులు కొలాం గొంది పునరావాస కాలనీకి వెళ్లి పాముకాటుకు గురైన అయ్యుబాయిని ఆసిఫాబాద్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమిం చడంతో వైద్యుల సూచన మేరకు మంచిర్యాల ఆస్పత్రికి తరలించాలని సూచించగా వేరే వాహనం మాట్లాడి మంచిర్యాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాధి తురాలు కోలుకుంది. సకాలంలో స్పందించి బాధితు రాలి ప్రాణంకాపాడిన పోలీసులను బంధువులు, గ్రామస్థులు అభినందించారు.