బాలిక కుటుంబానికి న్యాయం చేయాలి

ABN , First Publish Date - 2021-10-17T06:28:17+05:30 IST

జీవీఎంసీ 79వ వార్డు పరిధి అగనంపూడి దరి శనివాడలో ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందిన బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో శనివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టి నిరసన వ్యక్తం చేశారు.

బాలిక కుటుంబానికి న్యాయం చేయాలి

టీడీపీ డిమాండ్‌

అగనంపూడి, అక్టోబరు 16: జీవీఎంసీ 79వ వార్డు పరిధి అగనంపూడి దరి శనివాడలో ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందిన బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో శనివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. వార్డు కార్పొరేటర్‌ రౌతు శ్రీనివాస్‌ వేపచెట్టు జంక్షన్‌ వద్ద ఈ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బాలిక మృతి చెందడం బాధాకరమన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. ప్రభుత్వం తక్షణమే బాలిక కుటుంబానికి నష్టపరిహారం అందజేయాలని డిమాండ్‌ చేశారు.  స్థానిక టీడీపీ నాయకులు దంతులూరి సుబ్బరాజు, బలిరెడ్డి సత్యనారాయణ, బొబ్బరి సూర్యనారాయణ, నాగేశ్వరరావు, కత్తి తిలక్‌, యర్రా కోటేశ్వరరావు, మామిడి అప్పారావు, కరణం పైడిరాజు, యల్లపు సాంబశివరావు, సిండిగి సింహాచలం, లాలం కిశోర్‌, మాడిశ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-17T06:28:17+05:30 IST