ఘనంగా షిర్డీ సాయి విగ్రహ ప్రతిష్ఠ

ABN , First Publish Date - 2022-08-12T09:32:59+05:30 IST

ఘనంగా షిర్డీ సాయి విగ్రహ ప్రతిష్ఠ

ఘనంగా షిర్డీ సాయి విగ్రహ ప్రతిష్ఠ

బాబాను దర్శించుకోవాలని భక్తులకు మోహన్‌బాబు విజ్ఞప్తి

చంద్రగిరి, ఆగస్టు 11: తిరుపతి సమీపంలోని ఎ.రంగంపేట వద్ద మోహన్‌బాబు యూనివర్సిటీ పక్కన నిర్మించిన ఆలయంలో షిర్డీ సాయిబాబా విగ్రహ ప్రతిష్టను భక్తి శ్రద్ధలతో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ.. గతంలో బాబా ఆలయాన్ని నిర్మించాలన్న అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయని, ప్రస్తుతం నిర్మించిన ఆలయం ఎంతో ప్రత్యేకమైనదన్నారు. ఎక్కడాలేని విధంగా ఈ ఆలయంలో బాబా చిరునవ్వుతో కనిపిస్తారని తెలిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు ఈ ఆలయాన్ని కూడా దర్శించుకోవాలని ఆయన కోరారు. ధ్యాన మందిరాన్ని అద్భుతంగా నిర్మించామని మోహన్‌బాబు కుమార్తె లక్ష్మీప్రసన్న తెలియజేశారు. కాగా విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి షిండే, తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర రెడ్డి, మోహన్‌ బాబు తనయులు మనోజ్‌, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-12T09:32:59+05:30 IST