కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2021-04-24T04:24:47+05:30 IST

కరోనా రెండో దశను కట్టడిచేయడంలో ప్రభు త్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం పట్టణ కార్యదర్శి కె.శ్రీనివాసు లు డిమాండ్‌ చేశారు.

కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం

బద్వేలు, ఏప్రిల్‌23: కరోనా రెండో దశను కట్టడిచేయడంలో ప్రభు త్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం పట్టణ కార్యదర్శి కె.శ్రీనివాసు లు డిమాండ్‌ చేశారు. సీఐటీయూ కార్యాలయంలో ఆయన మా ట్లాడుతూ

రాష్ట్రంలో రోజుకు 10వేల కేసులు నమోదవుతున్నా అం దుకు అనుగుణంగా చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం కాగితాలకే పరిమితమైందన్నారు. బద్వేలులో కొవిడ్‌ సెంటర్‌ను తక్షణమే ఏర్పాటుచేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమం లో బద్వేలు పట్టణ కమిటీ సభ్యులు హుసేన, చాంద్‌బాష, మస్తాన, ప్రవీణ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

ప్రజల్లోనే మార్పు రావాలి

మైదుకూరు, ఏప్రిల్‌ 23: కరోనా కట్టడి విషయంలో ప్రజల్లోనే మార్పులు రావాలని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పేర్కొన్నా రు. ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కరోనా సెకండ్‌ వేవ్‌ దూసుకోస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కువ మంది కరోనా బారిన పడుతున్నారని, రోజు రోజుకూ  మృతుల సంఖ్య పెరుగుతోందన్నారు. తీవ్ర వేగంతో దూసుకోస్తోంద ని వివరించారు. ప్రజలు జాగ్రత్త వహించాలని సూచించారు. ప్రజల్లోనే మార్పు వస్తేని కట్టడి చేయవచ్చని తెలిపారు. 

Updated Date - 2021-04-24T04:24:47+05:30 IST