ప్రభుత్వానిది ప్రచార ఆర్భాటమే

ABN , First Publish Date - 2021-07-25T05:06:41+05:30 IST

అప్పులు తెచ్చి ఆర్భాటంగా ప్రచార ప్రకటనలు ఇవ్వడం తప్ప కనీసం రోడ్ల మరమ్మతులు సైతం జగన్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టడం లేదని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి, టీడీపీ సాలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి ఆర్పీభంజ్‌దేవ్‌లు ధ్వజమెత్తారు. రేగాపువలస సమీపంలో తోణాం వెళ్లే రోడ్డుపై శనివారం టీడీపీ నేతలు నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు.

ప్రభుత్వానిది ప్రచార ఆర్భాటమే
రేగాపువలస వద్ద తోణాం వెళ్లే రోడ్డుపై నాట్లు వేస్తున్న సాలూరు టీడీపీ నేతలు

తోణాం రోడ్డుపై నాట్లు వేసిన టీడీపీ నేతలు

సాలూరు రూరల్‌, జూలై 24: అప్పులు తెచ్చి ఆర్భాటంగా ప్రచార ప్రకటనలు ఇవ్వడం తప్ప కనీసం రోడ్ల మరమ్మతులు సైతం జగన్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టడం లేదని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి, టీడీపీ సాలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి ఆర్పీభంజ్‌దేవ్‌లు ధ్వజమెత్తారు. రేగాపువలస సమీపంలో తోణాం వెళ్లే రోడ్డుపై శనివారం టీడీపీ నేతలు నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ జగన్‌రెడ్డి రెండేళ్ల పాలనలో రోడ్ల నిర్వహణ గాలికొదిలేశారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులకు నిధులు మంజూరు చేసినా వాటిని పట్టించుకోవడం లేదని, పల్లె రోడ్లు పూర్తి దారుణంగా తయారయ్యాయని, వాటిపై గర్భిణులు పయనించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చింది గోరంతయితే ప్రకటనలు కొండంత అని ఎద్దేవా చేశారు. ఒకటో తేదీకి ఉద్యోగులకు జీతాలు, పింఛనుదారులకు పెన్షన్‌లు ఇవ్వలేకపోవడం సిగ్గుచేటన్నారు. జగన్‌రెడ్డి పాలనలో అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కార్యక్రమంలో డొంక ఈశ్వరరావు, ఆముదాల పరమేశు,ఆముజూరు శ్రీనివాసరావు, అక్యాన తిరుపతిరావు, చొక్కాపు త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-07-25T05:06:41+05:30 IST