ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2021-03-03T05:31:59+05:30 IST

నిత్యావసర సరుకుల ధరలను నియం త్రించడంలో ప్రభుత్వం పూర్తి గా విఫలమైం దని చీపురుపల్లి నియోజకవర్గ జనసేన కన్వీనర్‌ డి.రమేష్‌రాజు అన్నారు.

ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలం
మాట్లాడుతున్న ఆదాడ మోహనరావు

గుర్ల, మార్చి 2 : నిత్యావసర సరుకుల ధరలను నియం త్రించడంలో ప్రభుత్వం పూర్తి గా విఫలమైం దని చీపురుపల్లి నియోజకవర్గ జనసేన కన్వీనర్‌ డి.రమేష్‌రాజు అన్నారు. మంగళవారం ఆయన గుర్లలో మాట్లాడుతూ ప్రజలు నిరంతరం వినియోగించే వస్తువులు, పప్పు దినుసులు, గ్యాస్‌, పెట్రోల్‌ తదితర వాటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు పెంచడంతో పేదలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధరలను నియంత్రించకపోతే జిల్లాస్థాయిలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా జనసేన పార్టీ నాయకుడు ఆదాడ మోహనరావు మాట్లాడుతూ సామాన్యుల నడ్డి విరిచేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలొ పాలన పూర్తిగా విఫలమైందన్నారు. రోజు రోజుకీ దౌర్జన్యాలు, దోపిడీలు, హత్యలు పెరిగిపోయాయని ఆరోపించారు. పాలకులు ఎంతసేపూ దాచుకోవడం, దోచుకోవడంపై దృష్టి సారిస్తున్నారని ఆరోపించారు. 


Updated Date - 2021-03-03T05:31:59+05:30 IST