టైలర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి
ABN , First Publish Date - 2021-03-01T06:18:07+05:30 IST
టైలర్స్ డేను ఆదివారం ఇక్కడ ఘనంగా నిర్వహించారు.
నర్సీపట్నం : టైలర్స్ డేను ఆదివారం ఇక్కడ ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గాయత్రి టైలర్స్ సంఘం ఆధ్వర్యంలో అబీద్ సెంటర్ వరకు ర్యాలీ జరిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు సీహెచ్.సత్యనారాయణ మాట్లాడుతూ టైలర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయా లన్నారు. కార్యదర్శి రాంబాబు, ట్రెజరర్ భానోజీరావుతో పాటు పెద్ద సంఖ్యలో టైలర్లు పాల్గొన్నారు.
మాకవరపాలెంలో..
టైలర్స్ డే ఇక్కడ ఘనంగా జరిగింది. మండల టైలర్స్ సంఘం అధ్యక్షుడు ఈశ్వరరావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం టైలర్లను అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆయన కోరారు. అప్పలరాజుతో పాటు పలువురు టైలర్లు పాల్గొన్నారు.