అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది
ABN , First Publish Date - 2022-01-26T07:04:10+05:30 IST
రాష్ట్రంలో నిరుపేదలకు అండగా నిలువడమే ప్రధానలక్ష్యంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో తమ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తోందని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు.
ఎమ్మెల్యే రేఖానాయక్ ఫ ఖానాపూర్లో షాదీముబారక్ చెక్కుల పంపిణీ
ఖానాపూర్, జనవరి 25 : రాష్ట్రంలో నిరుపేదలకు అండగా నిలువడమే ప్రధానలక్ష్యంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో తమ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తోందని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే క్యాంపు క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అంగన్వడీ టీచర్ల నూతన చీరలను ఆ విష్కరించారు. అనంతరం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించిన షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హజరైన ఎమ్మెల్యే 36 మంది లభ్దీదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ వేర్వేరు కార్యక్రమాల్లో ఎంపీపీ అబ్దుల్ మోయిద్, మున్సిపల్ వైస్చైర్మన్ అబ్దుల్ ఖలీల్, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ గొర్రె గంగాధర్, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షులు రాజగంగన్న, ప్రధాన కార్యదర్శి తూము చరణ్, పట్టణాధ్యక్షులు పరిమి సురేష్, తహసీల్దార్ లక్ష్మీ తదితరులున్నారు.