అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది

ABN , First Publish Date - 2022-01-26T07:04:10+05:30 IST

రాష్ట్రంలో నిరుపేదలకు అండగా నిలువడమే ప్రధానలక్ష్యంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో తమ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తోందని ఖానాపూర్‌ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌ అన్నారు.

అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది
లబ్ధిదారులతో ఎమ్మెల్యే రేఖానాయక్‌

ఎమ్మెల్యే రేఖానాయక్‌ ఫ  ఖానాపూర్‌లో షాదీముబారక్‌ చెక్కుల పంపిణీ

ఖానాపూర్‌, జనవరి 25 : రాష్ట్రంలో నిరుపేదలకు అండగా నిలువడమే ప్రధానలక్ష్యంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో తమ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తోందని ఖానాపూర్‌ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే క్యాంపు క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అంగన్‌వడీ టీచర్‌ల నూతన చీరలను ఆ విష్కరించారు. అనంతరం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో నిర్వహించిన షాదీముబారక్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హజరైన ఎమ్మెల్యే 36 మంది లభ్దీదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ వేర్వేరు కార్యక్రమాల్లో ఎంపీపీ అబ్దుల్‌ మోయిద్‌, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ అబ్దుల్‌ ఖలీల్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ గొర్రె గంగాధర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ మండలాధ్యక్షులు రాజగంగన్న, ప్రధాన కార్యదర్శి తూము చరణ్‌, పట్టణాధ్యక్షులు పరిమి సురేష్‌, తహసీల్దార్‌ లక్ష్మీ తదితరులున్నారు. 

Updated Date - 2022-01-26T07:04:10+05:30 IST