ఐపీఎస్‌ అభిషేక్‌ మొహంతిని విధుల్లోకి తీసుకున్న ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-03-15T22:05:46+05:30 IST

ఐపీఎస్‌ అభిషేక్‌ మొహంతిని ప్రభుత్వం విధుల్లోకి

ఐపీఎస్‌ అభిషేక్‌ మొహంతిని విధుల్లోకి తీసుకున్న ప్రభుత్వం

హైదరాబాద్: ఐపీఎస్‌ అభిషేక్‌ మొహంతిని  ప్రభుత్వం విధుల్లోకి తీసుకుంది. అభిషేక్‌ మొహంతిని కేంద్రం ఏపీ కేడర్‌కు కేటాయించింది. అయితే ఏపీకి కేటాయించడాన్ని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌లో అభిషేక్ సవాలు చేశారు. అభిషేక్‌ను తెలంగాణకు కేటాయించాలని గతంలో క్యాట్‌ ఉత్తర్వులు ఇచ్చింది. ట్రైబ్యునల్‌ ఉత్తర్వులు అమలుకావడం లేదని కోర్టు దిక్కరణ పిటిషన్‌‌ను ఆయన వేశారు. అభిషేక్‌ను తెలంగాణ కేడర్‌కు తీసుకున్నట్లు హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. నిన్న జీవో 583 జారీచేసినట్లు హైకోర్టుకు అడ్వకేట్‌ జనరల్‌ తెలిపారు. 

Updated Date - 2022-03-15T22:05:46+05:30 IST