కాంగ్రెస్‌ ఇచ్చిన రాయితీలను ఎత్తివేసిన ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-06-27T06:51:15+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీ అధికారం లో ఉన్న సమయంలో వ్య వసాయ రంగానికి కల్పించిన రాయితీలను టీఆర్‌ఎ స్‌ ప్రభుత్వం ఎత్తివేసింద ని మాజీ ఎమ్మెల్యే నేనావత బాలునాయక్‌ ఆరోపించారు.

కాంగ్రెస్‌ ఇచ్చిన రాయితీలను ఎత్తివేసిన ప్రభుత్వం
రచ్చబండలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బాలునాయక్‌

డిండి, జూన 26: కాంగ్రెస్‌ పార్టీ అధికారం లో ఉన్న సమయంలో వ్య వసాయ రంగానికి కల్పించిన రాయితీలను టీఆర్‌ఎ స్‌ ప్రభుత్వం ఎత్తివేసింద ని మాజీ ఎమ్మెల్యే నేనావత బాలునాయక్‌ ఆరోపించారు. ఆదివారం మండలంలోని శక్రుతండా, రత్నతండా, నగరదుబ్బతండా, సింగరాజుపల్లి, రమాంతపూర్‌, కందుకూరు గ్రామాల్లో నిర్వహించిన కాంగ్రెస్‌ రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు, రైతుల కోసం చేపట్టిన ప థకాలు గురించి తెలియజేసేందుకు  రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. లక్ష రూపాయల రుణ మాఫీ చేస్తానని సీఎం చేసిన హామీని విస్మరించారని ఆరోపించారు. రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు, నిత్యావసర ధరలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో భారీగా పెరిగాయని విమర్శించారు. కాంగ్రెస్‌ పా ర్టీ అధికారంలోకి వస్తే చేపట్టనున్న పథకాల గురించి వివరించారు. కార్యక్రమం లో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దొంతినేని వెంకటేశ్వరరావు, మండల అధ్యక్షుడు న ల్లవెల్లి రాజే్‌షరెడ్డి, నాయకులు సిరాజ్‌ఖాన, లక్‌పతినాయక్‌, రాము, లక్ష్మణ్‌, కేతావత బద్య, రమేష్‌, దినేష్‌, భీముడు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-27T06:51:15+05:30 IST