జిల్లా పరిస్థితిపై గవర్నర్ ఆరా
ABN , First Publish Date - 2021-07-24T04:39:05+05:30 IST
జిల్లాలో వర్షాలు, వరద బీభత్సంపై రాష్ట్ర గవర్నర్ తమిళి సై ఆరా తీశారు.
నిర్మల్ టౌన్ : జిల్లాలో వర్షాలు, వరద బీభత్సంపై రాష్ట్ర గవర్నర్ తమిళి సై ఆరా తీశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని డీఎంఅండ్హెచ్వో జిల్లా కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె మాట్లాడారు. జిల్లా కేంద్రం ఎలా ఉందని ఆరా తీశారు. రెడ్క్రాస్ ద్వారా సహాయక చర్య లను వేగవంతం చేయాలని జిల్లా కోఆర్డినే టర్ డాక్టర్ అరుణ్ కుమార్, సాయన్నలకు గవర్నర్ సూచించారు.