మహనీయులను స్మరించుకోవాలి
ABN , First Publish Date - 2022-08-16T06:56:40+05:30 IST
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏయూ వీసీ పి.వి.జి.డి.ప్రసాద్రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించి ఎన్సీసీ కేడెట్ల గౌరవ వందనం స్వీకరించారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం వీసీ ప్రసాద్రెడ్డి
వర్సిటీలో ఘనంగా జెండా పండుగ
ఏయూ క్యాంపస్ : ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏయూ వీసీ పి.వి.జి.డి.ప్రసాద్రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించి ఎన్సీసీ కేడెట్ల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు కూడా త్యా గంచేసిన వారిని స్మరించుకుంటూ నవభా రత నిర్మాణంలో యువత పాలుపంచు కోవాలని పిలుపునిచ్చారు. ఏయూ విద్యార్థిని దుర్గాబాయి దేశ్ముఖ్ ఆధ్వర్యంలోని మహిళా ఉద్యమాలు, ఉప్పుసత్యాగ్రహం, శాసనోల్లంఘటన ఘట్టాల్లో అప్పటి ఏయూ వద్యార్థుల పాత్రను ప్రస్తావించారు. కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ సమత, రిజిస్ట్రార్ కృష్ణమోహన్తోపాటు పలువురు ఆచార్యులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.