కొద్ది గంటల్లో పెళ్లి జరుగుతుందనగా ఊహించని ఘటన.. పెళ్లి మంటపంలో కలకలం.. వరుడికి మైండ్బ్లాక్..!
ABN , First Publish Date - 2022-04-30T16:37:04+05:30 IST
కొద్ది గంటల్లో పెళ్లి ఉందనగా... కొన్ని సార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. సినిమాల్లో కనిపించే ఇలాంటి సీన్లు.. నిజ జీవితంలో కూడా...
కొద్ది గంటల్లో పెళ్లి ఉందనగా... కొన్ని సార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. సినిమాల్లో కనిపించే ఇలాంటి సీన్లు.. నిజ జీవితంలో కూడా అప్పుడప్పుడూ చూస్తూ ఉంటాం. మధ్యప్రదేశ్లో కూడా ఇలాంటి తరహా ఘటనే చోటు చేసుకుంది. ఓ కళ్యాణ మంటపంలో బంధువులు, అతిథులంతా సందడి సందడిగా గడుపుతున్నారు. కొద్ది సేపట్లో వివాహం జరుగుతుందనగా ఊహించని ఘటన చోటు చేసుకుంది. దీంతో వరుడితో పాటూ అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే...
మధ్యప్రదేశ్ గ్వాలియర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏప్రిల్ 21న స్థానికంగా నివాసం ఉంటున్న బలరామ్ శర్మ వివాహ కార్యక్రమం జరుగుతోంది. కార్యక్రమానికి బంధువులు, అతిథులంతా చేరుకున్నారు. దీంతో మంటపంలో సందడి వాతావరణం నెలకొంది. కొద్ది సేపట్లో వివాహ కార్యక్రమం జరుగుతుందనగా.. ఓ మహిళ లోపలికి ప్రవేశించింది. తనకు తెలీకుండా రెండో వివాహం ఎలా చేసుకుంటావు.. అని నిలదీయగా వరుడితో పాటూ అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. గొడవ పెద్దది కావడంతో పోలీసులు అక్కడికి చేరుకుని విచారించారు. మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. బలరామ్ శర్మతో బాధిత మహిళకు 2018లో ప్రేమ వివాహం జరిగింది.
ప్రియుడికి వేరే అమ్మాయితో పెళ్లి ఫిక్స్.. పెట్రోల్ బాటిల్తో సహా ఆ ప్రేయసి నేరుగా అతడి ఇంటికెళ్లి..
అప్పటి నుంచి ఇద్దరూ ఎవరికీ తెలీకుండా గది అద్దెకు తీసుకుని జీవనం సాగించారు. అప్పటి నుంచి భార్యకు బలరామ్ శర్మ తన బంధువులను ఎవరినీ పరిచయం చేయలేదు. ఈ క్రమంలో ఇటీవల గ్వాలియర్కు వచ్చిన బలరామ్ శర్మ.. రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న బాధితురాలు నేరుగా కళ్యాణ మంటపంలోకి రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా గురువారం బలరామ్ శర్మ, అతడి మొదటి భార్యను పోలీసులు స్టేషన్కి పిలిపించి విచారించారు. కలిసి జీవించేందుకు ఇద్దరూ నిరాకరించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది.