ఐక్యతతోనే పద్మశాలీల ఎదుగుదల సాధ్యం
ABN , First Publish Date - 2021-01-22T05:34:25+05:30 IST
పద్మశాలీలు ఐక్యంగా ఉన్నప్పుడే ఎదుగుదల సాధ్యమవుతుందని ఆ సంఘం మెదక్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జయరాములు పేర్కొన్నారు.
సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జయరాములు
పాపన్నపేట, జనవరి 21: పద్మశాలీలు ఐక్యంగా ఉన్నప్పుడే ఎదుగుదల సాధ్యమవుతుందని ఆ సంఘం మెదక్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జయరాములు పేర్కొన్నారు. మండల పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో గురువారం స్థానిక చేనేత సహకార సంఘ భవనంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పద్మశాలీలు విద్య, ఆర్థిక, రాజకీయ పరంగా ఎదగాలని పిలుపునిచ్చారు. అనంతరం మండల నాయకులతో కలిసి క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా సహాయ కార్యదర్శి నగే్షరాజు, లక్ష్మణ్, యాదగిరి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.