నల్లగొండలో హత్యకు గురైన వ్యక్తి తల లభ్యం
ABN , First Publish Date - 2022-01-11T03:06:51+05:30 IST
జిల్లాలోని చింతపల్లి మండలం గొల్లపల్లి గ్రామం విరాట్ నగర్లో
నల్లగొండ: జిల్లాలోని చింతపల్లి మండలం గొల్లపల్లి గ్రామం విరాట్ నగర్లో మహంకాళి దేవత పాదాల వద్ద లభ్యమైన వ్యక్తి తల ఆచూకీ లభ్యమైంది. సూర్యాపేట జిల్లా పాలకీడు మండలానికా చెందిన రమావత్ యాగేందర్ (30)గా పోలీసులు గుర్తించారు. పదేళ్ల క్రితమే ఇంటినుంచి యాగేందర్ వెళ్లిపోయినట్టు సమాచారం. యాగేందర్కు మానసిక స్థితి సరిగాలేనట్టు సమాచారం. తలను చూసి గుర్తు పట్టేందుకు కుటుంబ సభ్యులు వెళ్ళారు.
నల్లగొండ: నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలోని హైదరాబాద్-నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారిపై మొండెం లేని తల కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. గొల్లపల్లి గ్రామపంచాయతీ పరిధి విరాట్నగర్ శ్రీమెట్టు మహంకాళి దేవాలయంలోని మహంకాళి మాత విగ్రహం కాళ్ల వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి మొండెం నుంచి వేరు చేసిన తలను సోమవారం ఉదయం ఏడు గంటల సమయంలో పూజారి బ్రహ్మచారి గుర్తించారు.