ఇంద్రకీలాద్రిపై నేటితో ముగియనున్న పవిత్రోత్సవాలు

ABN , First Publish Date - 2022-08-13T06:13:19+05:30 IST

ఇంద్రకీలాద్రిపై నేటితో ముగియనున్న పవిత్రోత్సవాలు

ఇంద్రకీలాద్రిపై నేటితో ముగియనున్న పవిత్రోత్సవాలు
దుర్గగుడిలో భక్త జన సందోహం

వన్‌టౌన్‌, ఆగస్టు 12: ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో శనివారంతో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. ఉదయం పూర్ణాహుతిని నిర్వహించి ఉత్సవాలకు ముగింపు కార్యక్రమం పలికి పవిత్ర విసర్జన చేస్తారు. శుక్రవారం వేదోక్తంగా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి వచ్చారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయాన్ని పూలతో సుందరంగా ఆలంకరించారు. శ్రావణమాసంలో నిర్వహించే వరలక్ష్మి  వ్రతాన్ని ఈనెల 19న నిర్వహిస్తున్నారు. రూ.1500 రుసుం చెల్లించి పాల్గొనేవారికి ఒక విడత, ఉచితంగా పాల్గొనేవారికి మరో విడత వ్రత కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందుకు భక్తులు తమ పేర్లను రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని దేవస్థానం ఒక ప్రకటనలో సూచించింది.


Updated Date - 2022-08-13T06:13:19+05:30 IST