అపరాధ రుసుముల విధింపు ఆపాలి
ABN , First Publish Date - 2022-07-01T06:37:23+05:30 IST
ఆటో డ్రైవర్లపై అపరాధ రుసుములు వేయడాన్ని ఆపాలని ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి డిమాండ్ చేశారు.
నార్కట్పల్లి, జూన 30: ఆటో డ్రైవర్లపై అపరాధ రుసుములు వేయడాన్ని ఆపాలని ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి డిమాండ్ చేశారు. గురువారం నార్కట్పల్లి మండలం చెర్వుగట్టులో ఏర్పాటు చేసిన ఆటో డ్రైవర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ వేతనాల కోసం సీఎం కేసీఆర్ ఇచ్చిన టార్గెట్ సాధించడానికి ఆర్టీఏ అధికారులు పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ఆటోడ్రైవర్లను బలిపశువులు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విధానాన్ని తక్షణమే ఆపకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో ఆటో డ్రైవర్లు కోసిక గిరిబాబు, శంకర్, చిక్కుళ్ల అశోక్, కల్లూరి శివకుమార్, కురుమ యాదగిరి, సార లింగస్వామి, తోకల రాము, బాజ శివ, కడారి రవి, బుర్రి లక్ష్మణ్, శిగ కరుణాకర్ పాల్గొన్నారు.