చైర్మన్, ఈవో ఆధ్వర్యంలో కానుకలు లెక్క చూస్తున్న సిబ్బంది
ఐరాల(కాణిపాకం), జూలై 5: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.82,13,478 లభించినట్లు చైర్మన్ మోహన్రెడ్డి, ఈవో సురే్షబాబు తెలిపారు. మంగళవారం ఆస్థాన మండపంలో స్వామి కానుకలను చైర్మన్, ఈవో పర్యవేక్షణలో లెక్కించారు. 19 గ్రామల బంగారు, 450 గ్రాముల వెండి , 1,036 యూఎ్సఏ డాలర్లు, 40 యూఏఈ దిర్హామ్స్ లభించినట్లు తెలిపారు. ఈ ఆదాయం 15 రోజులలో లభించట్లు వెల్లడించారు. దేవదాయ శాఖ చిత్తూరు అసిస్టెంట్ కమిషనర్ ఏకాంబరం, అసిస్టెంట్ కమిషనర్ కస్తూరి, ఏఈవోలు ఎస్వీ కృష్ణారెడ్డి, విద్యాసాగర్రెడ్డి, రవీంద్రబాబు, హేమమాలిని, పర్యవేక్షకులు శ్రీధర్బాబు, కోదండపాణి పాల్గొన్నారు.