వైసీపీకి వీడని రంగుల పిచ్చి
ABN , First Publish Date - 2022-06-28T05:23:16+05:30 IST
వైసీపీకి పార్టీ రంగుల ప్రచారం పిచ్చి పట్టుకుంది. నిన్న మొన్నటి వరకు బడులు, గుడులూ, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, చెత్త సేకరణ వాహనాలు, సచివాలయాల్లో స్టేషనరీ, జగనన్న ఇళ్ల పట్టాల హామీ పత్రాలు, ఇలా ఏదీ వదిలిపెట్టకుండా మూడు రంగులతో నింపేయగా, కార్పొరేషన్ అధికారులు ఒకడుగు ముందుకు వేశారు.
ఒంగోలు (కార్పొరేషన్), జూన్ 27: వైసీపీకి పార్టీ రంగుల ప్రచారం పిచ్చి పట్టుకుంది. నిన్న మొన్నటి వరకు బడులు, గుడులూ, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, చెత్త సేకరణ వాహనాలు, సచివాలయాల్లో స్టేషనరీ, జగనన్న ఇళ్ల పట్టాల హామీ పత్రాలు, ఇలా ఏదీ వదిలిపెట్టకుండా మూడు రంగులతో నింపేయగా, కార్పొరేషన్ అధికారులు ఒకడుగు ముందుకు వేశారు. నగరంలోని జయరాం సెంటర్, సీవీఎన్ సెంటర్, మునిసిపల్ ఆఫీస్ రోడ్ జంక్షన్ వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన ఎల్ఈడీ లైట్ల స్తంభాలకు వైసీపీ రంగులతో అలంకరించేశారు. దీంతో నగర ప్రజలు ఇదేమి చోద్యం, విద్యుత్ స్తంభాలను నేతలు వదలడం లేదంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.