కేసీఆర్‌ నియంతృత్వ పాలన పోవాల్సిందే

ABN , First Publish Date - 2021-12-08T05:32:47+05:30 IST

కేసీఆర్‌ నియంతృత్వ పాలన పోవాల్సిందే

కేసీఆర్‌ నియంతృత్వ పాలన పోవాల్సిందే
మాట్లాడుతున్న బొక్క నర్సింహారెడ్డి

మొయినాబాద్‌ రూరల్‌: తెలంగాణలో నియంతృత్వ పాలనకు చరమగీతం  పాడాల్సిన తరుణం ఆసన్నమైందని రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొక్క నర్సింహ్మరెడ్డి అన్నారు. మండలంలోని హిమయత్‌నగర్‌లో మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం కేంద్రంపై నిందలు వేస్తూ కాలయాపన చేస్తోందన్నారు. వర్షాలతో నష్టపోయినా రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఆమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ జిల్లావ్యాప్తంగా నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కంజర్ల ప్రకాష్‌, మొయునాబాద్‌, చేవెళ్ల, షాబాద్‌ మండలాల పార్టీ అద్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, పాండురంగారెడ్డి, కిరణ్‌, నాయకులు ప్రతా్‌పరెడ్డి, నర్సింహారెడ్డి, బట్టు రాజమల్లేష్‌, అత్తాపురం శ్రీనివా్‌సగౌడ్‌, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-12-08T05:32:47+05:30 IST