రుణం పూర్తిగా ఇవ్వాల్సిందే..!
ABN , First Publish Date - 2020-12-04T05:00:16+05:30 IST
జగనన్న తోడు పథకంలో భాగంగా చిరు వ్యాపా రులకు మంజూరయ్యే రుణంలో కొన్ని బ్యాంకులు సగం రుణం మాత్రమే ఇస్తున్నట్లు గురువారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ గురవయ్య స్పందించారు. రూ.10 వేల రుణంలో సగం రుణం ఇవ్వడానికి లేదని, పూర్తిగా ఇవ్వాల్సిందేనని తెలిపారు.
‘ఆంధ్రజ్యోతి’ ఎఫెక్ట్
బొబ్బిలి: జగనన్న తోడు పథకంలో భాగంగా చిరు వ్యాపా రులకు మంజూరయ్యే రుణంలో కొన్ని బ్యాంకులు సగం రుణం మాత్రమే ఇస్తున్నట్లు గురువారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ గురవయ్య స్పందించారు. రూ.10 వేల రుణంలో సగం రుణం ఇవ్వడానికి లేదని, పూర్తిగా ఇవ్వాల్సిందేనని తెలిపారు. ఏయే బ్యాంకుల్లో లబ్ధిదారులకు అలా ఇస్తున్నారన్న దానిపై ఆయన ఆరా తీశారు. దీనిపై సంబంధిత బ్యాంకు మేనేజర్లతో మాట్లాడి పూర్తిస్థాయిలో రుణాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. స్టాంపు డ్యూటీ మినహా యింపునకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయన్నారు. లబ్ధిదారుల నుంచి స్టాంపు డ్యూటీని వసూలు చేయొద్దని మేనేజర్లను కోరామని తెలిపారు.