Viral news: 78 ఏళ్ల వయసులో తాతకు ఇదేం బుద్ధి.. మరీ ఇంత ఘాటు ప్రేమా..!

ABN , First Publish Date - 2021-10-09T02:56:55+05:30 IST

ప్రస్తుత కాలంలో 50 ఏళ్లు పైబడగానే అన్ని రోగాలూ చుట్టుముడతాయి. ఇక 60 ఏళ్లు దాటితే మంచానికి పరిమితమవడమో.. లేక మనువళ్లతో ఆడుకోవడమో చేస్తుంటారు. అయితే ఓ పెద్దాయన.. దీనికి పూర్తి భిన్నంగా ఉన్నట్టున్నాడు.

Viral news: 78 ఏళ్ల వయసులో తాతకు ఇదేం బుద్ధి.. మరీ ఇంత ఘాటు ప్రేమా..!

ప్రస్తుత కాలంలో 50 ఏళ్లు పైబడగానే అన్ని రోగాలూ చుట్టుముడతాయి. ఇక 60 ఏళ్లు దాటితే మంచానికి పరిమితమవడమో.. లేక మనువళ్లతో ఆడుకోవడమో చేస్తుంటారు. అయితే ఓ పెద్దాయన.. దీనికి పూర్తి భిన్నంగా ఉన్నట్టున్నాడు. తండ్రి వయసున్న వారు ప్రేమలో పడితేనే.. ఇతనికేం పోయే కాలం అని అంటాం. అలాంటిది తాత వయసున్న వారు ప్రేమలో పడితే.. ఈ వయసులో ఈయనకు ఇదేం బుద్ధి అంటాం కదా. ఇలాగే ఓ పెద్దాయన లేటు వయసులో చేసిన పని చూస్తే.. మరీ ఇంత ఘాటు ప్రేమనా.. అని అంటారు.


పెయింటర్, రిటైర్డ్ ప్రొఫెసర్ అయిన జిమ్ ఆడమ్స్(78) భార్య.. 2017లో చనిపోయింది. దీంతో తనకు తోడు కోసం 50 ఏళ్లు పైబడిన వారికోసం ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లో పేరు నమోదు చేసుకున్నాడు. కరోనా సమయంలో అందులో 79ఏళ్ల రిటైర్డ్ ఇన్సూరెన్స్ బ్రోకర్ ఆడ్రీ పరిచయమైంది. ఆమె 33 ఏళ్ల క్రితం భర్తతో విడిపోయింది. జిమ్, ఆడ్రీ మధ్య పరిచయం కాస్త.. ప్రేమగా మారింది. ప్రేమకు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తూ.. సెప్టెంబర్ 25న వివాహం చేసుకున్నారు. వారి పెళ్లి ఫొటోలను, ఫోటోగ్రాఫర్ జూలీ రాండ్.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది.

Updated Date - 2021-10-09T02:56:55+05:30 IST