చికిత్స పొందుతూ గీతకార్మికుడి మృతి
ABN , First Publish Date - 2021-03-06T06:09:29+05:30 IST
తాటిచెట్టు పైనుంచిపడి తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గీతకార్మికుడు శుక్రవారం మృతిచెందాడు.
తిరుమలగిరి, ఫిబ్రవరి 27: తాటిచెట్టు పైనుంచిపడి తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గీతకార్మికుడు శుక్రవారం మృతిచెందాడు. తిరుమలగిరి మునిసిపాలిటీ కేంద్రానికి చెందిన గోపగాని అంజయ్య(45) వారం రోజులక్రితం కల్లుకోసం తాటిచెట్టు ఎక్కి దిగుతుండగా ప్రమాదవశాత్తు జారికిందపడటంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంట నే హైదరాబాద్లోని ఓప్రైవేట్ ఆసుపత్రికి తరలించిగా అక్కడ చికిత్స పొందుతూ అంజయ్య మృతిచెందాడని కుటుంబసభ్యులు తెలిపారు.