విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2022-06-29T06:08:54+05:30 IST
చెట్టుకొమ్మ నరుకుతుండగా విద్యుదాఘాతానికి గురై గోపినేనిపాలెం గ్రామంలో అప్పికట్ల ప్రభాకర్రావు (47) అనే వ్యక్తి మంగళవారం మృతి చెందాడు.
వత్సవాయి, జూన్ 28: చెట్టుకొమ్మ నరుకుతుండగా విద్యుదాఘాతానికి గురై గోపినేనిపాలెం గ్రామంలో అప్పికట్ల ప్రభాకర్రావు (47) అనే వ్యక్తి మంగళవారం మృతి చెందాడు. కూలి పనికి వెళ్లిన అతడు కొమ్మను నరుకుతుండగా వైర్లకు గొడ్డలి తగిలి విద్యుదాఘాతానికి గురైయ్యాడు. అతడి కి భార్యా, ఇద్దరు కుమార్తులు. ఇంటి యజమానికి చనిపోవటంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.