అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-12-04T05:21:45+05:30 IST

గోనెగండ్ల మండలం బీ. అగ్రహారం గ్రామానికి చెందిన బోయ బోదేపాడు రామకృష్ణ(63) అనుమానాస్పదంగా మృతి చెందినట్లు ఎస్‌ఐ సురేష్‌ తెలిపారు.

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

గోనెగండ్ల, డిశంబరు 3: గోనెగండ్ల మండలం బీ. అగ్రహారం గ్రామానికి చెందిన బోయ బోదేపాడు రామకృష్ణ(63) అనుమానాస్పదంగా మృతి చెందినట్లు ఎస్‌ఐ సురేష్‌ తెలిపారు. రామకృష్ణకు భార్య లక్ష్మి, ముగ్గురు కుమారులు, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. అయితే శుక్రవారం తెల్లవారుజామున ఐదు గంటలకు రామకృష్ణ పొలానికి వెళ్లాడు. అనంతరం కుటుంబసభ్యులు ఉదయం పొలానికి వెళ్లగా అక్కడ అనుమానాస్పద స్థితిలో పడి ఉన్నాడు. నోటి వెంట నురగలు ఉన్నాయి. రామకృష్ణ పాము కాటకు గురై మృతి చెందాడా లేక ఇతర విష ప్రయోగం వల్ల మృతి చెందాడా అన్నది తేలాల్సి ఉంది. అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-12-04T05:21:45+05:30 IST