అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-10-18T05:47:26+05:30 IST

మండల కేంద్రంలోని శెట్టిపల్లి రామమోహన్‌ (27) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు సీకేదిన్నె ఎస్‌ఐ మంజునాథరెడ్డి తెలిపారు.

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

సీకేదిన్నె, అక్టోబరు 17: మండల కేంద్రంలోని శెట్టిపల్లి రామమోహన్‌ (27) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు సీకేదిన్నె ఎస్‌ఐ మంజునాథరెడ్డి తెలిపారు. ఆయన వివరాల మేరకు... ముద్దనూరు మండలం పెనికలపాడు గ్రామానికి చెందిన రామమోహన్‌కు 9 నెలల కిందట చింతకొమ్మదిన్నెకు చెందిన లక్ష్మిదేవితో వివాహ మైంది. అప్పటి నుంచి ఇక్కడే జీవనం సాగిస్తుండేవాడని, అప్పుడప్పుడు తమ స్వగ్రామానికి వెళ్లి వస్తుండేవాడన్నారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించి నట్లు తమకు సమాచారం రావడంతో తాము వెళ్లి పరిశీలించామని, పూర్తి సమాచారం తెలియాల్సి ఉందన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

Updated Date - 2021-10-18T05:47:26+05:30 IST