చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-04-21T06:50:14+05:30 IST
మండలంలోని బడ వాండ్లపల్లికి చెందిన దుద్దుకుంట రంగారెడ్డి రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ
నల్లమాడ, ఏప్రిల్ 20: మండలంలోని బడ వాండ్లపల్లికి చెందిన దుద్దుకుంట రంగారెడ్డి రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ కర్నూల్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుని భార్య సరస్వతి ఫి ర్యాదు మేరకు ఎస్ఐ శరత చంద్ర తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం ద్విచక్ర వాహన ప్రమాదంలో దుద్దుకుంట రంగారెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. అతని తలకు బలమైన గాయం కావడంతో వైద్య చికిత్సల కోసం నల్లమాడ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి కదిరికి తరలించారు. కదిరి నుంచి మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు. అక్కడ వైద్యు ల సూచన మేరకు కర్నూలు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నా రు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని బంధువులు, గ్రామస్థులు కోరారు.
రామప్పకుంటతండాకు చెందిన వృద్ధుడు..
తనకల్లు, ఏప్రిల్ 20: మండల పరిధిలోని రామప్పకుంటతండాకు చెందిన ఆశానాయక్ (60) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆశానాయక్ సోమవారం పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు 108 వాహనంలో తనకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షించిన డాక్టర్లు అనంతపురం ప్రభుత్వాసుపత్రికి రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందు తూ ఆశానాయక్ మంగళవారం మృతి చెందాడు. భార్య కమలమ్మ ఇచ్చిన ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు.