చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-02-27T03:36:46+05:30 IST

ఆత్మహత్యాయత్నం చేసిన గంగాపురం గ్రామానికి చెందిన బండారు శ్రీనివాసులు(30) జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం మృతి చెందినట్లు ఎస్‌ఐ జయప్రసాద్‌ తెలిపారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

జడ్చర్ల, ఫిబ్రవరి 26: ఆత్మహత్యాయత్నం చేసిన గంగాపురం గ్రామానికి చెందిన బండారు శ్రీనివాసులు(30) జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం మృతి చెందినట్లు ఎస్‌ఐ జయప్రసాద్‌ తెలిపారు. ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పులు తీర్చలేనన్న మనస్థాపానికి గురైన శ్రీనువాసులు ఈ నెల 21న పురుగుల మందు తాగాడు. చికిత్స కోసం బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి జిల్లా జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాసులుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

Updated Date - 2021-02-27T03:36:46+05:30 IST